జంపన్నవాగులో గల్లంతైన మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2021-07-14T16:38:40+05:30 IST

జంపన్న వాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన ఇద్దరి మృత దేహాలు లభ్యమయ్యాయి.

జంపన్నవాగులో గల్లంతైన మృతదేహాలు లభ్యం

ములుగు జిల్లా: మేడారం జంపన్న వాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన గుడిమడ కోటేశ్వరరావు, బంగారి శ్యామల్‌రావు మృతదేహాలు బుధవారం ఉదయం లభ్యమయ్యాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.


ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్న వాగు వరద నీటిలో ఇద్దరు గల్లంతైన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ అనుముల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల మేరకు... మణుగూరు మండలం కొండాపూర్‌కు చెందిన బంగారి శ్యామల్‌రావు(24), గుడిమడి కోటేశ్వరరావు(31) బంధుమిత్రులతో కలిసి వనదేవతల దర్శనానికి మేడారం వచ్చారన్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా గల్లంతయ్యారని తెలిపారు. కోటేశ్వరావుకు భార్య మీనా, ఇద్దరు పిల్లలు ఉండగా శ్యామల్‌రావు అవివాహితుడని సీఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-14T16:38:40+05:30 IST