ములుగు జిల్లాలో బొలెరో వాహనం బోల్తా

ABN , First Publish Date - 2020-12-05T16:37:54+05:30 IST

జిల్లాలోని ఏటూరునాగారం మండలం కేంద్రం సమీపంలోని వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.

ములుగు జిల్లాలో బొలెరో వాహనం బోల్తా

ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం మండలం కేంద్రం సమీపంలోని వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై  బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  12 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. వీరంతా వాజేడు మండలంలో మిర్చి తోటల్లో పనిచేసేందుకు వెళ్తుండగా బొలెరో వాహనంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసుల అక్కడకు చేరుకుని గాయపడిన వారిని 108అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-05T16:37:54+05:30 IST