యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు

ABN , First Publish Date - 2021-09-29T06:15:08+05:30 IST

యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి చెప్పారు.

యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న వీసీ

ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి


తుమ్మపాల, సెప్టెంబరు 28: యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి చెప్పారు. తుమ్మపాలలో ఏయూ సహకారంతో ఏర్పాటు చేసిన యోగా లైఫ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా సాధన ద్వారా ఒత్తిడి నుంచి బయటపడడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చన్నారు. ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, వైసీపీ పార్లమెంట్‌ పరిశీలకులు దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ, మానసిక ప్రశాంతతకు యోగా మించిన సాధనం లేదన్నారు. యోగా ద్వారా పలు రుగ్మతలను దూరం చేయవచ్చునన్నారు. అనంతరం యోగా లైఫ్‌ సెంటర్‌ నిర్వాహకులు కరణం బాబూరావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మీ, పీలా లక్ష్మీసౌజన్య, కొణతాల నీలిమ, జడ్పీటీసీ సభ్యురాలు సత్యవతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసీపీ నాయకులు మందపాటి జానకిరామరాజు, దంతులూరి దిలీప్‌కుమార్‌, డాక్టర్‌ విష్ణుమూర్తి, డాక్టర్‌ రామ్మూర్తి, జాజుల రమేష్‌, పీలా రాంబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T06:15:08+05:30 IST