A team of engineers: ముల్లైపెరియార్ డ్యాం నీటి విడుదల
ABN , First Publish Date - 2022-08-10T14:29:29+05:30 IST
తమిళనాడు-కేరళ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ముల్లైపెరియార్ డ్యాం(Mullaiperiyar Dam) నుంచి విడుదల చేస్తున్న నీటిని రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఇంజనీర్ల
ప్యారిస్(చెన్నై), ఆగస్టు 9: తమిళనాడు-కేరళ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ముల్లైపెరియార్ డ్యాం(Mullaiperiyar Dam) నుంచి విడుదల చేస్తున్న నీటిని రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఇంజనీర్ల బృందం మంగళవారం ఉదయం పరిశీలించింది. కేరళ రాష్ట్రం, ముల్లైపెరియార్ డ్యాం పరిసరాల్లో ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాలకు డ్యాం నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. నీటిమట్టం(water level) పెరుగుదలను కట్టడి చేసే ‘రూర్ గ్రవ్’ విధానం అమలులో ఉంది. డ్యాంలో చేరుతున్న మిగులు జలాలను 13 గేట్లు 90 సెం.మీ ఎత్తుకు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంజనీర్లు క్రీస్తు జేసుకుమార్, శ్యాంఇర్విన్, వైగై సాగు ఉత్తమపాళయం డివిజన్ ఇంజనీర్ అన్బుసెల్వం, పెరియార్ డ్యాం ఇంజనీర్ కుమార్ తదితరులు పరిశీలించారు.