ములాయం సింగ్ ఆరోగ్యం మెరుగవుతోంది: వైద్యుల ప్రకటన

ABN , First Publish Date - 2020-08-10T04:46:28+05:30 IST

సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు ఆదివారం నాడు ప్రకటించారు.

ములాయం సింగ్ ఆరోగ్యం మెరుగవుతోంది: వైద్యుల ప్రకటన

లక్నో: సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు ఆదివారం నాడు ప్రకటించారు. మూత్ర నాళ సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన శుక్రవారం నాడు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత.. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా వైరస్ సోకలేదని తేలింది. అంతకుమునుపు డాక్టర్లు ములాయంకు అల్ట్రా సౌండ్, రక్త, మూత్ర పరీక్షలు కూడా నిర్వహించారు.  ఈ క్రమంలో ఆదివారం నాడు ములాయం ఆరోగ్యం విషయమై ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ఆరోగ్యం మెరుగవుతోందని తెలిపారు. కాగా.. శనివారం నాడు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ములాయం సింగ్‌ను పరామర్శించారు. 

Updated Date - 2020-08-10T04:46:28+05:30 IST