ముక్తార్ పాషా, చంద్రమ్మల ఆశయ సాధనకు పోరాడతాం
ABN , First Publish Date - 2020-10-02T09:14:18+05:30 IST
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ ముక్తార్పాషా, పైలా చంద్రమ్మల ..
ద్రాక్షారామ, అక్టోబరు 1: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ ముక్తార్పాషా, పైలా చంద్రమ్మల ఆశయసాధనకు పోరాడాలని ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు జనిపెల్ల సత్తిబాబు పిలుపునిచ్చారు.
గురువారం రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శివారు వీరేశగుళ్లుకాలనీలో గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయంలో ముక్తార్ పాషా, చంద్రమ్మల సంతాప సభ జరిగింది. సభలో జనిపెల్ల సత్తిబాబు మాట్లాడుతూ వీరి మృతి విప్లవోద్యమానికి, కార్మిక, గిరిజన, ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ముందుగా పాషా, చంద్రమ్మల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి వి.భీమశంకరం, ప్రజా సంఘాల నాయకులు యు. గనిరాజు, గాంధీరాజు, గుబ్బల శ్రీను, రవివర్మ, శ్రీను, చిన్నయ్య పాల్గొన్నారు.