ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్
ABN , First Publish Date - 2020-08-10T07:51:27+05:30 IST
బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ సహాయకుడు, షార్ప్షూటర్ రాజేష్ పాండే అలియాస్ హనుమాన్ పాండేను ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఎన్కౌంటర్లో హతమార్చింది...
- ముఖ్తార్ అన్సారీ సహాయకుడి కాల్చివేత
లఖ్నవూ, ఆగస్టు 9: బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ సహాయకుడు, షార్ప్షూటర్ రాజేష్ పాండే అలియాస్ హనుమాన్ పాండేను ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఎన్కౌంటర్లో హతమార్చింది. ఆదివారం తెల్లవారుజామున లఖ్నవూలోని సరోజినీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ‘‘లఖ్నవూలోని గుడుంబా ప్రాంతంలో పాండే ఉన్నాడని మాకు సమాచారం అందింది. మేము గుడుంబా ప్రాంతానికి వెళ్లగానే పారిపోతుండగా, పాండే ఎస్యూవీ వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా అతను కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని వాహనం రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఆ వాహనంలో నుంచి ఓ వ్యక్తి మా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం మా సిబ్బంది కూడా కాల్పులు జరిపారు. కాసేపటి తర్వాత చూడగా ఈ కాల్పుల్లో పాండే తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ అతను చనిపోయాడు’’ అని ప్రత్యేక టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు.