బ్రేక్త్రూ ఎనర్జీ వెంచర్స్’లో ముఖేష్ పెట్టుబడులు...
ABN , First Publish Date - 2021-01-20T00:25:02+05:30 IST
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు చెందిన బ్రేక్త్రూ ఎనర్జీ వెంచర్స్ సంస్థలో 50 మిలియన్ డాలర్ల(రూ. 373 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.
‘ముంబై : ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు చెందిన బ్రేక్త్రూ ఎనర్జీ వెంచర్స్ సంస్థలో 50 మిలియన్ డాలర్ల(రూ. 373 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. వచ్చే 8-10 సంవత్సరాలలో విడతలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. వాతావరణ మార్పు సమస్యలను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించే మార్గాలను కనుగొనడంపై బీఈవీ కృషి చేస్తోంది.