త్యాగానికి ప్రతీక మొహర్రం
ABN , First Publish Date - 2022-08-10T06:20:53+05:30 IST
త్యాగానికి ప్రతీక మొహర్రం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9: త్యాగానికి ప్రతీక మొహర్రం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.కొండపల్లి మున్సిపాలిటీలోని కర్బలా మైదానం వరకు పీర్లతో నడిచారు. ఆయన మాట్లాడుతూ హజ్రత్ ఇమామ్హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలిచిందంటూ ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటినెల కూడా మొహర్రం అన్నారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.