ముద్రగడతో కాపు జేఏసీ సభ్యుల భేటీ

ABN , First Publish Date - 2020-09-21T18:34:53+05:30 IST

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు సోమవారం కలుసుకున్నారు.

ముద్రగడతో కాపు జేఏసీ సభ్యుల భేటీ

కాకినాడ - జగ్గంపేట: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు సోమవారం కలుసుకున్నారు. తూర్పు గోదావరి  జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ముద్రగడ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. 13 జిల్లాల నుండి  వచ్చిన  కాపు జేఏసీ  నాయకులను ముద్రగడ ఆహ్వానించారు. ముద్రగడ  స్వగృహంలో  కాపు  ఉద్యమంపై సమాలోచనలు చేపట్టారు. గతంలోనే  ముద్రగడ  కాపు ఉద్యమం నుండి తప్పుకొంటునట్లు  ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా విరామం  తర్వాత  రాష్ట్ర  కాపు జేఏసీ  కలయికపై  సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది. 

Updated Date - 2020-09-21T18:34:53+05:30 IST