ఆమె ఇంటి పెరట్లో గొయ్యి తవ్వింది.. తాగుబోతు భర్త రాక కోసం ఎదురుచూసి..

ABN , First Publish Date - 2022-07-02T17:35:27+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రోజూ మద్యం తాగివచ్చి...

ఆమె ఇంటి పెరట్లో గొయ్యి తవ్వింది.. తాగుబోతు భర్త రాక కోసం ఎదురుచూసి..

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రోజూ మద్యం తాగివచ్చి కొడుతున్న భర్తను అతని భార్య దారుణంగా హత్య చేసింది. అత్తమామల ఇంటికి చేరుకున్న ఆ భర్త తన భార్యపై దాడికి పాల్పడ్డాడని సమాచారం. భర్త రోజు కొడుతుండటంతో తీవ్రంగా కలత చెందిన భార్య తన సోదరుడితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. తరువాత ఇంటి పెరట్లో నాలుగు అడుగుల మేర గొయ్యి తవ్వి దానిలో భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఇదిలావుండగా చాలా రోజులుగా తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అతని తల్లి సుమిత్రాదేవి గ్రామం మంగత్‌ఖేడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కొడుకు ఓంప్రకాష్ ఇంటి నుంచి వెళ్లాక తరిగిరాలేదని తన ఫిర్యాదులో సుమిత్ర పేర్కొంది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో అత్తమామలపై అనుమానం రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడి భార్య సావిత్రిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.


 దీంతో పోలీసులు ఆ యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు భార్య సావిత్రి దేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 25 నుంచి ఆ యువకుడు కనిపించకుండా పోయాడని ఎస్పీ దినేష్ త్రిపాఠి తెలిపారు. అతని మృతదేహం అత్తమామల ఇంట్లో లభ్యమైంది. భార్యే హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన మేనల్లుడు అత్తమామల ఇంటికి వెళ్లినప్పటి నుంచి కనిపించకుండా పోయాడని మృతుని మామ తెలిపారు. పోలీసులు మృతుని అత్తమామలను ప్రశ్నించగా ఓంప్రకాష్ ఇంటిలో భార్యతో గొడవపడ్డాడని చెప్పారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు.  తరువాత ఓంప్రకాష్ ఇంటి తలుపు దగ్గర పడుకున్నాడు. అనంతరం దారుణ హత్యకు గురయ్యాడు.



Updated Date - 2022-07-02T17:35:27+05:30 IST