రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన: ముద్దరబోయిన

ABN , First Publish Date - 2022-01-22T06:47:29+05:30 IST

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన: ముద్దరబోయిన

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన: ముద్దరబోయిన
మాట్లాడుతున్న ముద్దరబోయిన

ముసునూరు, జనవరి 21: వైసీపీ అప్రజాస్వామిక పాలనలో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముద్దర బోయిన వెంకటేశ్వరావు విమర్శించారు. శుక్రవారం సూరేపల్లిలో నిర్వహించిన గౌరవసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా రౌడీయిజంతో భయపెడుతున్నారని ముద్దరబోయిన మండిపడ్డారు. పీఆర్సీ కోసం న్యాయపోరాటం చేస్తున్న ఉద్యోగులపై కేసులు పెట్టి, కొట్టించిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందని, మాయమాటలతో ఉద్యోగులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రబుద్ధుడు జగన్‌ అని, త్వరలోనే ప్రజలందరూ బుద్ది చెబుతారని హెచ్చరించారు. దేవినేని ఢాలారాం, కందుల పిచ్చియ్య, చళ్లగోళ్ల నాగమల్లేశ్వరావు, శోభనాద్రి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T06:47:29+05:30 IST