సడక్ బంద్ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-06-27T01:53:00+05:30 IST
మంద కృష్ణమాదిగ ఆదేశానుసారం జూలై 2న నిర్వహించే సడక్ బంద్, 3న జరిగే చలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంఎ్సపి జిల్లా నేత పందిటి అంబేద్కర్ మాదిగ పిలుపునిచ్చారు.
అల్లూరు, జూన్ 26 : మంద కృష్ణమాదిగ ఆదేశానుసారం జూలై 2న నిర్వహించే సడక్ బంద్, 3న జరిగే చలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంఎ్సపి జిల్లా నేత పందిటి అంబేద్కర్ మాదిగ పిలుపునిచ్చారు. ఈనెల 19న కావలి మండలం రాజులవారి చింతలవారిపాలెం నుంచి ప్రారంభమైన మాదిగల సంగ్రామ యాత్ర ఆదివారం మండలంలోని బట్రకాగొల్లు, నార్తుమోపూరుల మీదుగా అల్లూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ముందుగా పాతబస్టాండు కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక అరుందతీయవాడకు యాత్రను కొనసాగించారు. ఢీల్లీలో పెద్దల కుర్చీలు దద్దరిల్లేలా జూలై 2న నిర్వహించే జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి, 3న చలో హైదరాబాద్కు పెద్ద ఎత్తున మాదిగలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అక్కీలగుంట ఏసుమాదిగ, కావలి శ్రీనుమాదిగ, కత్తి శివయ్య మాదిగ, కావలి, గోపి, దర్శిగుంట విజయ్ మాదిగ, తిరుపతి పెంచలయ్య మాదిగ, మంచు ప్రసాద్ మాదిగ, కావలి శీనయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.