నా దృష్టిలో ధోనీ డాన్.. దేశం కోసం ఆడటమే అతనికి ఇష్టం: శ్రీశాంత్
ABN , First Publish Date - 2020-05-31T19:31:59+05:30 IST
టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2019 జూలై నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. చివరిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్లో కనిపించిన ధోనీ.. ఆ తర్వాత
టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2019 జూలై నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. చివరిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్లో కనిపించిన ధోనీ.. ఆ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టలేదు. తాజాగా ధోనీ రిటైర్మెంట్కి సంబంధించి వచ్చిన పలు వార్తలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్.. ధోనీ ఇంకా దేశం కోసం ఆడే అవకాశం ఉందని అన్నాడు. హలో యాప్ ద్వారా అతను మాట్లాడుతూ.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు.
‘‘నాకు తెలిసినంత వరకూ అతను ఇంకా ఫిట్గా ఉన్నాడు. నా దృష్టిలో అతను ఓ డాన్.. అతన్ని పట్టుకోవడం కష్టమే కాదు.. అసాధ్యం. అతను దేశం కోసం ఆడటాన్ని ఇష్టపడతాడు. అది అతని రక్తంలో ఉంది. అతనికి కేవలం 38 సంవత్సరాలే. సచిన్ వంటి ఆటగాళ్లు 40 ఏళ్లు వచ్చే వరకూ ఆడారు’’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.