ధోనీ ఫీజ్ తీసుకోవడం లేదు: జై షా
ABN , First Publish Date - 2021-10-13T00:08:18+05:30 IST
ముంబై: టీ20 ప్రపంచకప్ పోటీల్లో టీమ్ ఇండియా మెంటార్గా సేవలందించేందుకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీజ్ తీసుకోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
ముంబై: టీ20 ప్రపంచకప్ పోటీల్లో టీమ్ ఇండియా మెంటార్గా సేవలందించేందుకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీజ్ తీసుకోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. సోషల్ మీడియా వేదికగా షా ఈ విషయం వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్కు భారత టీమ్ను ప్రకటించిన రోజే ధోనీ టీమ్ ఇండియాకు మెంటార్గా వ్యవహరిస్తారని వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ పోటీలు ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్లో జరగనున్నాయి.