తిప్పనపల్లి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన Mandakrishna
ABN , First Publish Date - 2022-02-03T16:27:30+05:30 IST
జిల్లాలోని సుజాతనగర్ హరిజన వాడలో గత నెల 28వ తారీకు తిప్పనపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని సుజాతనగర్ హరిజన వాడలో గత నెల 28వ తారీకు తిప్పనపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మృతుల కుటుంబ సభ్యులకు కుటుంబానికి ఒక ఉద్యోగం సింగరేణి యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి సింగరేణి యాజమాన్యం, లంగాణ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల్లో మరణించిన ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రత్యేక పాలసీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.