వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-04T22:57:29+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకుల ఆగ్రహం

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకుల ఆగ్రహం

గుంటూరు: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే తన వెంట తీసుకెళ్లాడని ఆమె కొడుకు యుగంధర్‌ మండిపడ్డారు. గురువారం రోజు పద్మావతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనుంది. ఎమ్మెల్యే ఆర్కే తీరుపై పద్మావతి కుటుంబీకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాన్ని వైసీపీ మానసికంగా వేధిస్తోందని వైసీపీ ఎంపీటీసీ పద్మావతి కొడుకు యుగంధర్‌ ఆరోపించారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోయినా.. ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారని పద్మావతి కొడుకు యుగంధర్ ఆరోపించారు. దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తమను వేధిస్తున్నాడని యుగంధర్‌ అన్నారు. వైసీపీ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఎంపీటీసీ పద్మావతి కొడుకు యుగంధర్ తెలిపారు.

Read more