ఏడు నుంచి ఎంపీఈడీ పరీక్షలు
ABN , First Publish Date - 2020-09-27T11:38:55+05:30 IST
ఏడు నుంచి ఎంపీఈడీ పరీక్షలు
విశాఖపట్నం(స్పోర్ట్సు), సెప్టెంబరు 26: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి ఆదేశాల మేరకు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎంపీఈడీ) నాల్గవ సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు ఏడు నుంచి నిర్వహించనున్నట్టు వర్సిటీ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రం సంచాలకులు ఆచార్య ఎన్.విజయ్మోహన్, విబాగాధిపతి డాక్టర్ ఎ.పల్లవి వెల్లడించారు. ఈనేపథ్యంలో పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయడంతోపాటు కొవిడ్-19 నిబంధనలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.