ఈకేవైసీ నమోదు చేయించుకోండి
ABN , First Publish Date - 2020-06-07T06:00:11+05:30 IST
ఈకెవైసీపీ నమోదు వేగవంతం చేసినట్టు ఎంపీడీవో గంగాధరరావు తెలిపారు.
ఉండి/ఆకివీడు/భీమవరం రూరల్, జూన్ 6 : ఈకెవైసీపీ నమోదు వేగవంతం చేసినట్టు ఎంపీడీవో గంగాధరరావు తెలిపారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఈకేవైసీ నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు.ప్రతీ కార్డుదారుడు విధిగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆకివీడు ఎంపీడీవో పోశింశెట్టి రమాదేవి మాట్లాడుతూ అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. వలంటీర్లకు దరఖాస్తు ఇస్తే గ్రామ సచివాలయాల్లో నమోదు చేస్తారన్నారు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్ సర్వేచేసి ఎంపీడీవో కార్యాలయానికి పంపిస్తారని తెలిపారు. తుది పరిశీలనలో అర్హులుగా తేలితే ఐదు రోజుల్లో పింఛను మం జూరు చేస్తామన్నారు. కోళ్ళపర్రు, దుంపగడప గ్రామాల నుంచి 8 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో ఒకటి అనర్హులుగా గుర్తించామన్నారు. అర్హులకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భీమవరం ఎంపీడీవో జి.పద్మ ఆదేశించారు. అర్హుల జాబితాపై మండల కార్యాలయంలో కార్యదర్శులతో సమీక్షించారు.