తండ్రి బాటలోనే జగన్ నడుస్తున్నారు: ఎంపీ విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2020-07-08T15:05:24+05:30 IST

తండ్రి బాటలోనే జగన్ నడుస్తున్నారు: ఎంపీ విజయసాయిరెడ్డి

తండ్రి బాటలోనే జగన్ నడుస్తున్నారు: ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 71వ జయంతిని నేడు జరుపుకుంటున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి వైస్ ఎంతో కృషి చేశారన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ జయంతి వేడుకలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తండ్రి బాటలోనే జగన్ నడుస్తున్నారని అన్నారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పధకాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒక్క ఏడాదిలోనే ప్రజల మనసులో జగన్ స్థానం సంపాందించారని ఎంపీ తెలిపారు. 


మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ...వైఎస్ హయాంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని...అదే బాటలో జగన్ పాలన జరుగుతోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆగస్టు 15కల్లా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని...రాష్ట్రాన్ని అన్ని రంగాలలోను అభివృద్ధి చేస్తామని...అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మంత్రి అవంతి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-08T15:05:24+05:30 IST