విశాఖకు రాజధాని రావడం ఖాయం: ఎంపీ విజయసాయి రెడ్డి

ABN , First Publish Date - 2021-06-17T22:59:38+05:30 IST

ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి రాజధానుల అంశంపై మాట్లాడారు. విశాఖపట్నానికి రాజధాని రావడం

విశాఖకు రాజధాని రావడం ఖాయం: ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ: ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి రాజధానుల అంశంపై మాట్లాడారు. విశాఖపట్నానికి రాజధాని రావడం ఖాయమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాజధాని రావడం ఖాయమని తాము పదేపదే చెబుతున్నామన్నారు. అయితే విశాఖకు రాజధాని త్వరలోనే వస్తుందని, తేదీ ఎప్పుడు అనేది తామే చెబుతామన్నారు. వాల్యు బేసిడ్ టాక్స్ విధానం అనేది దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమని, దాన్ని మనం కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.


15 శాతం కన్నా ఎక్కువగా టాక్స్ పెరిగే అవకాశం లేదన్నారు. స్లమ్స్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్నప్పుడు గ్యారెంటీ కింద ప్రభుత్వ ఆస్తులు పెట్టడం అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమీ కాదని, ఆ విధానం ఎప్పటి నుంచో వస్తున్నదే అని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-06-17T22:59:38+05:30 IST