త్వరలో వైసీపీలోకి గంటా

ABN , First Publish Date - 2021-03-04T08:57:53+05:30 IST

టీడీపీ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరనున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. గంటా ప్రధాన అనుచరుడు బొడ్డేటి కాశీ

త్వరలో వైసీపీలోకి గంటా

సీఎం పరిశీలనలో ఆయన ప్రతిపాదనలు: విజయసాయిరెడ్డి 


విశాఖపట్నం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరనున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. గంటా ప్రధాన అనుచరుడు బొడ్డేటి కాశీ విశ్వనాథం బుధవారం విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు పార్టీలోకి రావడానికి కొన్ని ప్రతిపాదనలు పంపించారని, అవి సీఎం జగన్‌ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వైసీపీలో వ్యక్తిగత నిర్ణయాలకు తావులేదని, ఒకరు వ్యతిరేకించారని, మరొకరు మద్దతు పలికారని నిర్ణయం తీసుకోవడం జరగదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీయే ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటుందని, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కలిసి చర్చిస్తారని చెప్పారు.  

Updated Date - 2021-03-04T08:57:53+05:30 IST