హైకోర్టుకు స్టే ఇచ్చే అధికారం లేదు: విజయసాయి
ABN , First Publish Date - 2020-09-19T09:31:49+05:30 IST
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19(3) ప్రకారం అమరావతి భూ కుంభకోణం విచారణపై స్టే ఇచ్చే అధికారం హైకోర్టుకు లేదని
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19(3) ప్రకారం అమరావతి భూ కుంభకోణం విచారణపై స్టే ఇచ్చే అధికారం హైకోర్టుకు లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పార్లమెంటు ప్రాంగణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకపోతే హైకోర్టు ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించవచ్చన్నారు. అంతేగానీ స్టే విధించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కాగా, అమరావతి భూములు, ఫైబర్నెట్ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలందరూ శుక్రవారం మధ్యాహ్నం కొద్దిసేపు ప్లకార్డులతో ధర్నా చేశారు.