విశాఖ మరింత అభివృద్ధికి సీఎం ప్రణాళిక: ఎంపీ విజయసాయిరెడ్డి
ABN , First Publish Date - 2021-10-12T17:31:50+05:30 IST
విశాఖను మరింత అభివృద్ధి చేయటానికి సీఎం జగన్ మరికొన్ని ప్రణాళికలు చేస్తున్నారని ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు.
విశాఖపట్నం: విశాఖను మరింత అభివృద్ధి చేయటానికి సీఎం జగన్ మరికొన్ని ప్రణాళికలు చేస్తున్నారని ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. 8 జోన్లో 8 సైట్లు గుర్తించి 50 శాతం ఎంపీ నిధులు, మిగతా 50 శాతం జీవీఎంసీ నిధులతో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నామని అన్నారు. దాతలు ఇంకా ముందుకు వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
జీవీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ...1000 మంది కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నామని తెలిపారు. సుమారు ఒకసంవత్సరంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.