అశోక్ గజపతిరాజు ఒక దొంగ: ఎంపీ విజయసాయి రెడ్డి

ABN , First Publish Date - 2021-06-17T03:25:04+05:30 IST

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఒక దొంగ అని ఎంపీ విజయసాయి

అశోక్ గజపతిరాజు ఒక దొంగ: ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ: టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఒక దొంగ అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన వల్లనే పంచ గ్రామాల్లో భూ సమస్య వచ్చిందని ఆరోపించారు. ఈ భూ సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. దొడ్డి దారిన అశోక్ గజపతి రాజు మళ్లీ సింహాచలం దేవస్థాన చైర్మన్ అయ్యారని ఆయన విమర్శించారు. దీనిపై డివిజన్ బెంచ్‌కి అప్పీల్‌కి వెళ్తున్నామని ఆయన వివరించారు. డివిజన్ బెంచ్‌లో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అశోక్ గజపతి రాజును మళ్లీ అతి త్వరలో చైర్మన్ కుర్చీనుంచి తప్పకుండా దించేస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-06-17T03:25:04+05:30 IST