ఎంపీ వెంకట్రెడ్డి ఆత్మీయ సమ్మేళనం రేపు
ABN , First Publish Date - 2022-05-22T06:31:49+05:30 IST
భువనగిరి పార్లమెం ట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన ఆయన పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గు మ్ముల మోహనరెడ్డి తెలిపారు.
నల్లగొండ టౌన, మే 21: భువనగిరి పార్లమెం ట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన ఆయన పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గు మ్ముల మోహనరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకట్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం మర్రిగూడ బైపాస్ నుంచి ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారని వె ల్లడించారు. నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మునిసిపల్ ఫ్లోర్లీడర్ బుర్రి శ్రీనివా్సరెడ్డి, జడ్పీటీసీ లక్ష్మయ్య, రమేష్, శ్రీనివాస్, శంకర్, వెంకటేశ్వర్లు, సుభాష్యాదవ్, హుస్సేన, సైదిరెడ్డి, కలీల్ పాల్గొన్నారు.