ఓయూని గల్లీ స్థాయికి తీసుకొచ్చారు: ఉత్తమ్

ABN , First Publish Date - 2022-05-02T21:18:29+05:30 IST

ఓయూను అంతర్జాతీయ స్థాయికి పెంచుతామని.. గల్లీ స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఓయూని గల్లీ స్థాయికి తీసుకొచ్చారు: ఉత్తమ్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీని అంతర్జాతీయ స్థాయికి పెంచుతామని.. గల్లీ స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని ఓయూకి  రావడానికి అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓయూ వీసీలుగా గొప్ప గొప్ప వారు పనిచేశారన్నారు. ఇప్పుడున్న వీసీ విజ్ఞతతో ఆలోచించాలన్నారు. రాహుల్ గాంధీది రాజకీయ విజిట్ కాదన్నారు. రాహుల్ లాంటి నేతలు ఓయూకి వెళ్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో కనీసం స్టాఫ్ నియామకం కూడా జరగడం లేదని చెప్పారు. రాహుల్ తెలంగాణలో పర్యటించడంపై టీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీనేనని చెప్పారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే పదేళ్లు కేసీఆర్ తపస్సు చేసినా రాష్ట్రం వచ్చేది కాదన్నారు. గులాబీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. వారు వెంటనే క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-02T21:18:29+05:30 IST