కేసీఆర్ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-04-13T21:10:09+05:30 IST
కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా హాలియాలో కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారని ఈసీకి
సూర్యాపేట: కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా హాలియాలో కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారని ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ వాహనాల్లో మద్యం, డబ్బు తరలిస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర బలగాలతో సాగర్ ఉప ఎన్నిక నిర్వహించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సాగర్లో స్థానికేతర నాయకులను తక్షణమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. కలెక్టర్కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంమని ఉత్తమ్ ఫిర్యాదు చేశారు.