ఫిర్యాదుల కాపీలు ఉంటే నాకు పంపించండి: సుజనా

ABN , First Publish Date - 2021-12-22T15:23:41+05:30 IST

ఏపీలో అరాచక పాలన సాగుతోందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు పరాకాష్టన్నారు.

ఫిర్యాదుల కాపీలు ఉంటే నాకు పంపించండి: సుజనా

అమరావతివ: ఏపీలో అరాచక పాలన సాగుతోందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు పరాకాష్టన్నారు. సీఎం జగన్‌, మంత్రులు, ఎంపీల పేర్లతో కబ్జాలు, బెదిరింపులకు పాల్పడడం రివాజుగా మారిందని ఆయన ఆరోపించారు. సీఎం ఇటువంటి దాడులను తక్షణం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుల కాపీలు తనకు పంపించాలని సూచించారు. మీకు అం డగా ఉంటానని హమీ ఇచ్చారు. అలాగే saveandhrapradesh2022@gmail.com మెయిల్‌ చేయాలని సూచించారు. 

Updated Date - 2021-12-22T15:23:41+05:30 IST