అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు: ఎంపీ సుజనా

ABN , First Publish Date - 2021-11-21T20:35:17+05:30 IST

రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రైతుల పాదయాత్రకు బీజేపీ తరపున సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదన్నారు.

అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు: ఎంపీ సుజనా

ప్రకాశం: రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రైతుల పాదయాత్రకు బీజేపీ తరపున సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదన్నారు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ అయినా సభ్య సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. 

Updated Date - 2021-11-21T20:35:17+05:30 IST