పోడు రైతులను ఇబ్బందులు పెట్టొద్దు: ఎంపీ బాపూరావు
ABN , First Publish Date - 2021-07-15T23:26:31+05:30 IST
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే కోనప్పలు తమ మధ్య ఉన్న విభేదాలతో జిల్లాలోని పోడు రైతులను
కుమరం భీం: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే కోనప్పలు తమ మధ్య ఉన్న విభేదాలతో జిల్లాలోని పోడు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి, ఎమ్మెల్యే కోనప్ప మధ్య ఏమైనా విరోధం ఉంటే వారే చూసుకోవాలని ఆయన విమర్శించారు. వారి మధ్య ఉన్న విబేధాతలో పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. కోనప్పకు దమ్ముంటే అసెంబ్లీలో పోడు భూములపై మాట్లాడాలని సోయం సవాల్ విసిరారు. ఉప ఎన్నికలప్పుడే కేసీఆర్కు ఉద్యోగాలు గుర్తుకు వస్తున్నాయని ఎంపీ బాపూరావు ఆరోపించారు.