ఉల్లాసంగా ‘రన్‌ ఫర్‌ పీస్‌’

ABN , First Publish Date - 2022-10-03T09:30:44+05:30 IST

గాంధీ జయంతి సందర్భంగా గచ్చిబౌలిలోని బొటానికల్‌ గార్డెన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ‘రన్‌ ఫర్‌ పీస్‌’ పరుగు పోటీలను రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించారు.

ఉల్లాసంగా ‘రన్‌ ఫర్‌ పీస్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): గాంధీ జయంతి సందర్భంగా గచ్చిబౌలిలోని బొటానికల్‌ గార్డెన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ‘రన్‌ ఫర్‌ పీస్‌’ పరుగు పోటీలను రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించారు. ఇక, ఈ పోటీల 10కే రన్‌ పురుషుల కేటగిరీలో చంద్రాష్‌, మహిళల్లో నవ్య విజేతలుగా నిలిచారు. సంతో్‌షతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ ఎంపీ నిఽధుల నుంచి గార్డెన్‌ అభివృద్ధికి రూ.40 లక్షలు కేటాయించారు. కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భరత్‌కుమార్‌ రెడ్డి, ఆంధ్రజ్యోతి జీఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-03T09:30:44+05:30 IST