ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆహ్వాన కమిటీ సభ్యులు రంజిత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-24T21:36:42+05:30 IST

తన చేవెళ్ల పార్లమెంట్ పరిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ హైటెక్స్ లో టిఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే

ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆహ్వాన కమిటీ సభ్యులు రంజిత్ రెడ్డి

హైదరాబాద్: తన చేవెళ్ల పార్లమెంట్ పరిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ హైటెక్స్ లో టిఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను ఆహ్వాన కమిటీ సభ్యులు, స్థానిక లోక్ సభ సభ్యులు డా.గడ్డం రంజిత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ ఇతర నాయకులతో కలిసి హైటెక్స్ లో పర్యటిస్తూ ఏర్పాట్లపై తగు సూచనలు చేస్తున్నారు.


 ఆదివారం కూడా ఆయన ఏర్పాట్లను దగ్గరుండి చేయిస్తున్నారు.ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలను తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.అలాగే  ప్లీనరీ సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఎంపీ రంజిత్ రెడ్డి వెంట ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,  కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు వున్నారు.

Updated Date - 2021-10-24T21:36:42+05:30 IST