ధాన్యం కొనుగోలు పై స్పష్టత ఇవ్వాలి: రంజిత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-30T00:38:10+05:30 IST

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొనుగోలు విషయమై స్పష్టత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు

ధాన్యం కొనుగోలు పై స్పష్టత ఇవ్వాలి: రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొనుగోలు విషయమై స్పష్టత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు.భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్ సభలో చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 377 నిబంధన ప్రకారం ఈ విషయం పై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం కేసిఆర్ రైతు ఫ్రెండ్లీ పరిపాలన చేస్తున్నారన్నారు. కేసిఆర్  దార్శనికత వల్ల సమృద్ధిగా నీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు పంటల పెట్టుబడి కింద రైతు బంధు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉన్నాయన్నారు. 


ఈ కారణంగా ప్రతి ఏడాది రాష్ట్రంలో పంటలు అధికంగా పండుతున్నాయి. దిగుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఏడాది ఎఫ్.సి.ఐ కొనుగోలు చేసే బియ్యం లక్ష్యాన్ని ఒకేసారి నిర్ణయించే విధంగా ఆదేశించాలని ప్రధానిని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. అలాగే, ప్రతి ఏటా పెరుగుతున్న దిగుబడులను అనుసరించి, ఎఫ్ సి. ఐ కొనుగోలు ను కూడా పెంచాలి. ఎదుగుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం సహకారంగా ఉండాలని, ఏవిధంగా ఎఫ్.సి.ఐ ని ఆదేశించాలని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రధాని మోడీ ని కోరారు.

Updated Date - 2021-11-30T00:38:10+05:30 IST