తెలంగాణ ఖ్యాతిని చాటిన క్రీడాకారులను అభినందించిన చేవెళ్ల ఎంపీ

ABN , First Publish Date - 2021-11-20T20:26:07+05:30 IST

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మస్కు నరేందర్ కుమార్తె మస్కు నేహా, కోచ్ సుధాకర్ యాదవ్ మార్గ నిర్దేశనంలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని గోల్డ్

తెలంగాణ ఖ్యాతిని చాటిన క్రీడాకారులను అభినందించిన చేవెళ్ల ఎంపీ

హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మస్కు నరేందర్ కుమార్తె మస్కు నేహా, కోచ్ సుధాకర్ యాదవ్ మార్గ నిర్దేశనంలో  న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది.ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి వారిని సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల్లో సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు.అట్లాగే క్రీడాకారులు మన రాష్ట్ర ఖ్యాతిని దేశ నలుమూలల చాటాలని మస్కు నేహా ను అభినందించారు.

Updated Date - 2021-11-20T20:26:07+05:30 IST