మోదీకి ఎంపీ రఘురామ లేఖ

ABN , First Publish Date - 2021-08-05T00:43:50+05:30 IST

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక అక్రమాలపై ప్రధానికి లేఖలో వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అప్పులు ఇస్తున్న..

మోదీకి ఎంపీ రఘురామ లేఖ

ఢిల్లీ: ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక అక్రమాలపై ప్రధానికి లేఖలో వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అప్పులు ఇస్తున్న.. బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకు, ఆర్థికశాఖ అధికారుల కుమ్మక్కుపై కేంద్ర ఆర్థికశాఖలోని తీవ్ర నేర పరిశోధనా విభాగం ద్వారా విచారణ చేపట్టాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.


మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. కొత్తగా తెచ్చే అప్పులు చేతికి అందకుండా, పాత అప్పులకు వడ్డీగానో, వాయిదా చెల్లింపుగానో మినహాయించుకునే దుస్థితి నెలకొంది. రిజర్వ్‌బ్యాంక్‌ వద్ద మంగళవారం సెక్యూరిటీలు వేలం వేసి తెచ్చిన రూ.2,000 కోట్ల అప్పును, అదే రిజర్వ్‌బ్యాంకు ఓడీ అప్పు కింద జమ చేసుకుంది. అయినా ప్రభుత్వం ఇంకా ఓడీ నుంచి బయటపడకపోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనం. 

Updated Date - 2021-08-05T00:43:50+05:30 IST