ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2021-10-14T22:45:16+05:30 IST

అన్ని శాఖల సమస్యలు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతారు అని ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారని విమర్శించారు.

ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారు: ఎంపీ రఘురామ

అమరావతి: అన్ని శాఖల సమస్యలు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతారు అని ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారని విమర్శించారు. రేపోమాపో సజ్జల మంత్రి అవుతారని అంటున్నారని చెప్పారు. ఒక్క శాఖకు మంత్రి అవుతారో లేక సకల శాఖలకు మంత్రి అవుతారో అర్థం కావడం లేదన్నారు. జగనన్న కొవ్వొత్తుల పథకం, వైఎస్సార్ అగ్గిపెట్టే పథకం పెట్టేలా ఉన్నారని విమర్శించారు. జెన్‌కో, ట్రాన్స్‌కోకు ఒకరే చైర్మన్‌గా ఉండాలన్నారు. 

Updated Date - 2021-10-14T22:45:16+05:30 IST