ఎన్టీఆర్ను భారతరత్నతో గౌరవించుకోవాలి: ఎంపీ Raghurama
ABN , First Publish Date - 2022-01-18T17:00:06+05:30 IST
తెలుగు ఖ్యాతిని భారతదేశ దశ, దిశల్లో వ్యాపింపజేసిన మహనాయకుడు, గొప్ప నటుడు ఎన్టీఆర్ అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.
న్యూఢిల్లీ: తెలుగు ఖ్యాతిని భారతదేశ దశ, దిశల్లో వ్యాపింపజేసిన మహనాయకుడు, గొప్ప నటుడు ఎన్టీఆర్ అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. అద్భుతమైన పరిపాలన అందించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వచ్చే ఏడాది ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా భారతరత్నతో గౌరవించుకోవాలని కోరుకుంటున్నానని ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు.