ఏపీ హైకోర్టులో ఎంపీ Raghurama లంచ్ మోషన్ పిటిషన్
ABN , First Publish Date - 2022-07-01T17:33:05+05:30 IST
ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు.
అమరావతి: ఏపీ హైకోర్టు(AP highcourt)లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama krishnam raju) లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈనెల 4న భీమవరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) పర్యటనకు హాజరయ్యేందుకు తనకు రక్షణ కల్పించాలంటూ రఘురామ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ‘‘ఎంపీగా మీరు పర్యటనకు వెళ్లొచ్చు కదా’’ అంటూ లాయర్ ఉమేష్ చంద్రను ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఏదో ఒక కేసు పెట్టి తన క్లయింట్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని లాయర్ కోర్టుకు తెలిపారు. ఎలాంటి కేసులు లేకుండా రక్షణ కల్పించాలంటూ... భీమవరం వెళ్లేందుకు అనుమతించాలని కోరారు.