Raghurama krishnam raju: కేంద్రంపై తమలపాకు యుద్ధం చేస్తున్నాం: ఎంపీ రఘురామ
ABN , First Publish Date - 2022-07-28T20:11:35+05:30 IST
కేంద్రంపై తమలపాకు యుద్ధం చేస్తున్నామని ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు.
న్యూఢిల్లీ: కేంద్రంపై తమలపాకు యుద్ధం చేస్తున్నామని ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama krishnam raju) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నవ్వి పొదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది’’ అంటూ యెద్దేవా చేశారు. తమ పార్టీ మూడేళ్ల నుంచి యుద్ధం చేస్తోందని తెలిపారు. యుద్ధం చేసేవాళ్లు.. కనిపిస్తే కాళ్లు పట్టుకుంటారా అని ప్రశ్నించారు. తమ ఎంపీలు రఘురామ అనర్హత బ్యానర్ తప్ప పార్లమెంట్లో ఏమైనా పట్టుకున్నారా? అని నిలదీశారు. కేంద్రంపై సీఎం జగన్ (Jagan) యుద్ధం చేస్తున్నారని అన్నారని... బటన్ మోహన్ రెడ్డి కేంద్రంపై సీరియస్గా యుద్ధం చేస్తున్నారా అంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలు చేశారు.