మంత్రి కొడాలి నానికి కౌంటర్ ఇచ్చిన ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2020-09-24T20:06:12+05:30 IST

మంత్రి కొడాలి నాని హిందు దేవాలయాల్లో విగ్రాహాల ధ్వంసంపై చేసిన వ్యాఖ్యలపై..

మంత్రి కొడాలి నానికి కౌంటర్ ఇచ్చిన ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హిందు దేవాలయాల్లో విగ్రాహాల ధ్వంసంపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు కౌంటర్ ఇచ్చారు. గురువారం ఢిల్లీలోని రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి గాని.. వేరే ఎవరైనాసరే మన ఇంట్లో పెట్టుకున్న ఇష్టమైన వ్యక్తులు, లేక దేవుళ్ల ఫోటోలపై ఎవరైనా ఉమ్మి వేసి.. ఫోటోయేకదా ఇంకొక ఫోటో ఇస్తాలే అని అంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఏమౌతుంది అంటే ఇది అంతేనని రఘురామ అన్నారు.


దేవాలయాల్లో విగ్రహాలను పగులగొట్టి ఇంకొకటి పెడదామని, రథం దగ్ధం అయితే కొత్తది వస్తాదని అంటే సరికాదని రఘురామ అన్నారు. ఇలాగే ఉంటే.. ప్రజలు తిరగబడి తగిన విధంగా బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందన్నారు. కొడాలి నాని ప్రధాని మోదీ, సీఎం యోగిపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అసలు వాళ్ల గురించి తెలుసుకోకుండా దుర్భాషలాడడం దురదృష్టకరమని రఘురామ అన్నారు.

Updated Date - 2020-09-24T20:06:12+05:30 IST