దమ్ముంటే నన్ను పార్టీ ఛానల్ డిబేట్‌కు పిలవాలి: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-01-19T21:40:57+05:30 IST

కొందరు ఉద్యోగులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నంత మాత్రానా హక్కుల సాధన కోసం ఉద్యమం ఆపవద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

దమ్ముంటే నన్ను పార్టీ ఛానల్ డిబేట్‌కు పిలవాలి: ఎంపీ రఘురామ

ఢిల్లీ: కొందరు ఉద్యోగులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నంత మాత్రానా హక్కుల సాధన కోసం ఉద్యమం ఆపవద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గతంలో సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్న సీఎం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నిలబెట్టుకోలేదన్నారు. జీతాలు సరైన సమయంలో ఇవ్వకపోగా.. ఉన్న జీతాల్లో కోత పెట్టారని మండిపడ్డారు. హెచ్ఆర్ఏ నుంచి పోలీసులకు మినహాయింపు ఇచ్చారని చెప్పారు. సీఎం ఆదేశించినప్పుడు కొట్టడం, తప్పుడు కేసుల పెట్టినందుకే ఈ ప్రతిఫలం అన్నారు. రాష్ట్రంలో ఆదాయం పడిపోయింది కాబట్టి ఉద్యోగస్థుల ప్రయోజనాలకు కోత పెట్టారని ఆయన పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయకుండా.. అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నా.. దమ్ముంటే అనర్హత వేటు వేయించుకోండన్నారు. అన్ని పార్టీల మద్దతుతోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తానని స్పష్టం చేశారు. ‘‘దమ్ముంటే నన్ను తమ పార్టీ ఛానల్ డిబేట్‌కు పిలవాలి’’ అన్నారు. 

Updated Date - 2022-01-19T21:40:57+05:30 IST