ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: రఘురామ
ABN , First Publish Date - 2020-09-06T21:38:20+05:30 IST
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: రఘురామ
ఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి రథం కాలిపోయిన విధానం చూస్తుంటే కుట్ర ప్రకారమే జరిగినట్లు అనుమానంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ స్వయంగా స్పందించాలన్నారు. దీన్ని మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన చర్యగా వదిలేయకుండా డీజీపీతో ప్రత్యక్షంగా మాట్లాడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.