ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-18T22:36:27+05:30 IST

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు

రాజమండ్రి: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో  పెద్ద కుంభకోణం జరుగుతుందన్నారు. 17వేల మంది రైతులు ఆధార్‌తో  లింక్ కాలేదన్నారు. దీనిలో రైస్ మిల్లుల యజమానులు, అధికారుల  జోక్యం వుందని ఆయన ఆరోపించారు. ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు వున్నాయని స్పష్టం చేశారు. దీనిపై సీఐడీ విచారణ కోరతానని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను సిఎం జగన్  ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-05-18T22:36:27+05:30 IST