తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ హామీ

ABN , First Publish Date - 2022-05-25T05:47:00+05:30 IST

వేములదీవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ రఘురాంకృష్ణంరాజు హామీ ఇచ్చారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ హామీ
జనసేన నాయకులతో కలిసి పర్యటిస్తున్న ఎంపీ ప్రతినిధులు

నరసాపురం, మే 24: వేములదీవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ రఘురాంకృష్ణంరాజు హామీ ఇచ్చారు. ఇటీవల జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ ఢిల్లీ పర్యటనలో వేములదీవిలో తాగునీటి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఆయన వ్యక్తిగత కార్యదర్శి వర్మ, కొత్తపల్లి నాగరాజును నరసాపురం పంపించారు. జనసేన కన్వీనర్‌ బొమ్మిడి నాయకర్‌తో కలిసి వేములదీవి గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని కోరారు. అదే సమయంలో ఎంపీ పోన్‌లో గ్రామస్థులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు భట్టిప్రోలు మహేష్‌, వలవల నాని, తోట శ్రీధర్‌, యడ్లపల్లి మహేష్‌, బెల్లంకొండ యర్రయ్య, పి.సాంబ ఉన్నారు.

Updated Date - 2022-05-25T05:47:00+05:30 IST