ఈశ్వరప్పపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-02-22T20:15:51+05:30 IST

ఎర్రకోటపై కేసరి బావుటాను ఎగురవేస్తామని చెప్పిన మంత్రి ఈశ్వరప్పపై దేశద్రోహి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ జిల్లా విభాగం నగరంలో సోమవారం ఆందోళన చేపట్టింది. నగరంలోని గడిగి

ఈశ్వరప్పపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి

                    -  రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ హుసేన్‌


బళ్ళారి(కర్ణాటక): ఎర్రకోటపై కేసరి బావుటాను ఎగురవేస్తామని చెప్పిన మంత్రి ఈశ్వరప్పపై దేశద్రోహి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ జిల్లా విభాగం నగరంలో సోమవారం ఆందోళన చేపట్టింది. నగరంలోని గడిగి చెన్నప్ప సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ఆందోళన జిల్లా అధికారి కార్యాలయం వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఈశ్వరప్పకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారి పవన్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ హుసేన్‌ మాట్లాడుతూ శివమొగ్గలో జాతీయ జెండాను ఎగురవేయడానికి మంతి మద్దతు పలకడం సరికాదని, ఇది దేశద్రోహిగా పరిగణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ముండరిగి నాగరాజు, కాంగ్రెస్‌ నాయకులు కల్లుకంబ పంపాపతి, జేఎస్‌ ఆంజనేయులు, వెంకటరమణ, అయాజ్‌ అహ్మద్‌, వెంకటేష్‌ హెగడే, జగన్‌, తాయప్ప, విల్సన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-22T20:15:51+05:30 IST