‘ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు శుభపరిణామం’

ABN , First Publish Date - 2022-01-26T22:19:58+05:30 IST

‘ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు శుభపరిణామం’

‘ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు శుభపరిణామం’

ప్రకాశం: ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు శుభపరిణామమని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐదు నియోజక వర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చెయ్యాలని గతంలోనే సీఎం జగన్ ని కోరామని తెలిపారు. మరోసారి సీఎంని కలిసి వినతిపత్రం ఇస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో 35 జిల్లాలు ఏర్పాటైతే పరిపాలనా సౌలభ్యంకి బాగుంటుందన్నారు. కందుకూరు నియోజక వర్గంలో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ జిల్లాలో కందుకూరు నియోజక వర్గాన్ని కలపాలన్నారు. 


Updated Date - 2022-01-26T22:19:58+05:30 IST