‘ఎంపీ మాధవ్ను సస్పెండ్ చేయాలి’
ABN , First Publish Date - 2022-08-08T05:40:44+05:30 IST
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో తెలుగుయువత, తెలుగుమహిళ, తెలుగునాడు స్టూడెండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 7: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో తెలుగుయువత, తెలుగుమహిళ, తెలుగునాడు స్టూడెండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఎంపీ గోరంట్లను తక్షణమే బర్తరఫ్ చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ఎంపీ దిష్టి బొమ్మను దహనం చేశారు. మహిళలతో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్న వారిపై వైసీపీ చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో తెలుగుయువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు, తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు బి.ప్రహర్ష, కమిటీ ప్రతినిధులు కె.ప్రతాప్, సురేష్, జె.సంతోష్, సీహెచ్ తాతారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.