ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-12-02T03:42:46+05:30 IST

ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: కోమటిరెడ్డి...

ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: కోమటిరెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుదల నిర్ణయంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఘాటుగా స్పందించారు. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని, పేద, మధ్య తరగతి ప్రజలు అయోమయంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆర్టీసీ ధరలు పెంచి ప్రజలకు రవాణా భారాన్ని కూడా పెంచాలని చూస్తుందన్నారు. కేసీఆర్ ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయం మూలిగే నక్కపై పండు పడ్డట్టుగా ఉందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-02T03:42:46+05:30 IST