కేసీఆర్‎కి ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా: కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి

ABN , First Publish Date - 2022-01-25T00:24:09+05:30 IST

నల్లగొండ దత్తత విషయం కేసీఆర్‎కి మూడేళ్ల తర్వాత గుర్తొచ్చిందా అని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా సమస్యలు..

కేసీఆర్‎కి ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా: కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి

నల్లగొండ: నల్లగొండ దత్తత విషయం కేసీఆర్‎కి మూడేళ్ల తర్వాత గుర్తొచ్చిందా అని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా సమస్యలు, అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‎కు వినతి పత్రాలు అందజేసిన ఆయన.. దత్తత తీసుకుంటానని మాయ మాటలు చెప్పడంతోనే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ‘‘వానాకాలం ధాన్యం అమ్ముకునేందుకు మూడు నెలలు రైతులు ఇబ్బందులు పడ్డారు, ఇప్పటి వరకు ధాన్యం డబ్బులు రైతులకి అందలేదు. ఎన్జీ కాలేజ్ నేను కట్టిస్తాననడంతో కాలేజీకి నిధులు కేటాయించారు. నల్గొండ అభివృద్ధికి సహకరిస్తాం. రోడ్డు వెడల్పుతో నష్టపోయేవారికి సరైన‌ నష్టపరిహారం ఇవ్వకపోతే ఊరుకోం. సిద్దిపేటలో ఇచ్చిన విధంగా ఇక్కడా పరిహారం అందజేయాలి.’’ అని కోమటి‎రెడ్డి వెంకట్‎రెడ్డి సూచించారు. 

Updated Date - 2022-01-25T00:24:09+05:30 IST